మద్యనిషేధ చట్టమును మాన్యుడు రాము(డు రూపు దిద్దగన్
చోద్య మదేమియో పిదప చోదకులెల్లరు నీరుగారినన్
బాధ్యత లేక పాక్షికపు మార్పులజేయగ నిశ్చయించినన్ మద్యనిషేధచట్టమును మానిను లెల్లఁ దిరస్కరించిరే!
(రాముడనగ శ్రీ నందమూరి తారక రామరావుగారనుకొనప్రార్థన )
Monday 18 June 2012
అర్జునుడు కృష్ణుడితో పలికిన పలుకులు:
నీదు వాత్సల్య బలమున నీరజాక్ష !
బిడ్డడా వాడు? రణరంగ భీకరుండు
శత్రువుల ద్రుంచ వంచించి చంపినారు
ధర్మ సంరక్షణము వీడి దాగనేల?
కంది శంకరయ్య చెప్పారు... సహదేవుడు గారూ, సహదేవుడా సెబాసని యహమహమిక లేక మెత్తు రందరు నీ ఖే దహరమ్మగు పూరణమును, మహనీయుడు పార్థసఖుడు మధురిమనొసగున్
శ్రిగురుభ్యోనమః
ఆర్యా,
ధన్యవాదములు. తమరిసూచన మేరకు సవరణ:
ఆత్మ దెలియు నంతర్ముఖ యాణ మందు
నిత్య తద్ధ్యాన సాధన నేర్పు నిచ్చు
భువిని పంచేంద్రి యాసక్త భోగ, మోహ
జాలమే యవరోధమ్ము సాధకులకు
Pandita Nemani చెప్పారు...శ్రీ సహదేవుడు గారి పూరణ చాలా బాగున్నది. కౌరవులకున్న అధికమైన సేనతో గెలుస్తారనే ఊహలు నిజము కావు కావు అని అరచిన ఒక కాకిని వారు చంపినట్లు అర్థమగుచున్నది. భావ వైవిధ్యము - చాల బాగున్నది.